ETV Bharat / bharat

BJP Candidate List 2023 Assembly Election : బీజేపీ నయా ప్లాన్​.. అసెంబ్లీ ఎన్నికల బరిలో 18 మంది ఎంపీలు

author img

By PTI

Published : Oct 9, 2023, 5:40 PM IST

Updated : Oct 9, 2023, 7:58 PM IST

BJP Candidate List 2023 Assembly Election : మరికొద్ది రోజుల్లో జరగబోయే ఐదు శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్ శాసనసభ ఎన్నికల్లో ఏకంగా 18 మంది ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుపుతోంది.

BJP Candidate List 2023 Assembly Election
BJP Candidate List 2023 Assembly Election

BJP Candidate List 2023 Assembly Election : త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ వ్యూహాలను రచిస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమరానికి సైమీ ఫైనల్​గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​ నుంచి నలుగురు కేంద్ర మంత్రులు సహా 18 మంది ఎంపీలను శాసనసభ ఎన్నికల బరిలోకి దింపుతోంది. ఇప్పటికే ఛత్తీస్​గఢ్​లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను.. మధ్యప్రదేశ్​లో రెండు జాబితాలను విడుదల చేసింది. తాజాగా ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించి మరో జాబితాను విడుదల చేసింది. అంతేగాక రాజస్థాన్​ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది అధిష్ఠానం.

మధ్యప్రదేశ్​ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే 57 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది బీజేపీ అధిష్ఠానం. ఈ జాబితాలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​, రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్​ మిశ్రా ఉన్నారు. సీఎం శివరాజ్ బుధ్ని నుంచి బరిలోకి దిగుతుండగా.. నరోత్తమ్ మిశ్రా దతియా నుంచి పోటీ చేస్తున్నారు. అంతకుముందు బీజేపీ విడుదల చేసిన జాబితాలో ముగ్గురు కేంద్ర మంత్రులు సహా ఏడుగురు ఎంపీలను శాసససభ ఎన్నికల బరిలోకి దింపింది.

  • BJP releases a list of 57 candidates for the upcoming election in Madhya Pradesh.

    CM Shivraj Singh Chouhan to contest from Budhni, State's HM Narottam Mishra to contest from Datia, Gopal Bhargava from Rehli, Vishwas Sarang from Narela and Tulsiram Silavat to contest from Sanwer pic.twitter.com/BxnfNqLKg1

    — ANI (@ANI) October 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఛత్తీస్​గఢ్​లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 64 మంది అభ్యర్థులను ప్రకటించగా.. అందులో ఛత్తీస్​గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్​.. రాజ్​నంద్​గావ్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే ఎంపీలు రేణుకా సింగ్, గోమతి సాయి కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. మొత్తం బీజేపీ రెండు విడతల్లో విడుదల చేసిన 85 విడుదల చేసిన జాబితాలో ఓ కేంద్ర మంత్రి సహా ముగ్గురు ఎంపీలు ఉన్నారు.

రాజస్థాన్​లో బీజేపీ తరఫున పోటీ చేసే 41 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. వీరిలో రాజ్​సమంద్ ఎంపీ దియా కుమారి, జైపుర్ రూరల్ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్​ సహా ఏడుగురు ఎంపీలు ఉన్నారు. విద్యాధర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దియా కుమారి బరిలోకి ఉండగా.. జోత్వారా నుంచి రాజ్యవర్ధన్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

  • BJP releases a list of 41 candidates for the upcoming election in Rajasthan.

    Rajyavardhan Singh Rathore to contest from Jhotwara, Diya Kumari from Vidhyadhar Nagar, Baba Balaknath from Tijara, Hansraj Meena from Sapotra and Kirodi Lal Meena to contest from Sawai Madhopur. pic.twitter.com/S68CstH35Y

    — ANI (@ANI) October 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం'
త్వరలో జరగబోయే రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో దిగడంపై బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్ స్పందించారు. 'ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పనిచేసిన వారిని శాసనసభ ఎన్నికల బరిలో దింపడం వల్ల పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుంది. శాసనసభ ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. రాజస్థాన్‌ రాజకీయ మార్పు చాలా అవసరం. ' అని పేర్కొన్నారు.

  • #WATCH | On BJP MPs being fielded in the upcoming State elections, party leader Rajyavardhan Singh Rathore says, "A new zeal comes among the workers that a few people who used to work with PM Modi and who PM Modi has seen carefully are being fielded in the Vidhan Sabha election.… pic.twitter.com/jqB161hX83

    — ANI (@ANI) October 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఓటర్లు గుణపాఠం చెబుతారు'
రాబోయే మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహరించే వారికి ఓటర్లు గుణపాఠం చెబుతారని అన్నారు కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్‌నాథ్‌. 'రాష్ట్ర ప్రజలందరూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎన్నికల తేదీలు ఈరోజు ఖరారయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని అపహరించిన వారికి గుణపాఠం చెప్పి రాష్ట్రంలో నిజమైన ప్రభుత్వాన్ని స్థాపించే రోజు ఆసన్నమైంది. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలి.' అని అన్నారు.

Rahul Gandhi On Caste Census : దేశవ్యాప్త కులగణనకు కాంగ్రెస్ డిమాండ్​.. ఎన్నికల్లో ఇదే ప్రధాన అస్త్రం!

Madhya Pradesh Election 2023 : మధ్యప్రదేశ్​ అసెంబ్లీకి నవంబర్ 17న పోలింగ్.. బీజేపీ X కాంగ్రెస్​ సంగ్రామంలో విజేత ఎవరో?

Rajasthan Elections 2023 : రాజస్థాన్​లో సెంటిమెంట్​ రిపీట్​ అవుతుందా? లేక కాంగ్రెస్​కే జై కొడతారా?

Last Updated : Oct 9, 2023, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.