ETV Bharat / bharat

దేశంలో 82 లక్షలు దాటిన కరోనా కేసులు

author img

By

Published : Nov 2, 2020, 9:35 AM IST

Updated : Nov 2, 2020, 10:22 AM IST

దేశంలో కొత్తగా 45 వేల కరోనా కేసులు బయటపడ్డాయి. 496 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82 లక్షలకు చేరగా... మరణాల సంఖ్య 1,22,607కు చేరుకుంది. ఒక్కరోజులో 8.55 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు జరిగాయి. మొత్తం నమూనా పరీక్షల సంఖ్య 11.07 కోట్లకు చేరింది.

corona cases in india
భారత్​లో కరోనా కేసులు

భారత్​లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ.. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేంద్ర వైద్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో కొత్తగా 45,230 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. వైరస్ ధాటికి మరో 496 మంది మరణించారు.

corona cases in india
దేశంలో కరోనా కేసుల వివరాలు
  • రికవరీ రేటు: 91.68 శాతం
  • మరణాల రేటు: 1.49 శాతం
  • యాక్టివ్ కేసులు: 6.83 శాతం

ఆదివారం ఒక్కరోజు 8,55,800 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 11.07 కోట్లకు చేరినట్లు స్పష్టం చేసింది.

Last Updated : Nov 2, 2020, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.