ETV Bharat / bharat

'గాంధీ'లకు భద్రత తగ్గింపు నిర్ణయం వారిదే!

author img

By

Published : Nov 20, 2019, 12:26 PM IST

Updated : Nov 20, 2019, 7:16 PM IST

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి భద్రత తగ్గింపు అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. ఎస్పీజీ స్థానంలో సీఆర్​పీఎఫ్​ భద్రత కల్పించడం వెనుక రాజకీయ కారణాలు లేవని అధికార పక్షం స్పష్టంచేసింది.

'హోంశాఖ నిర్ణయమే..రాజకీయాలకు తావులేదు'

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి భద్రత తగ్గింపు వెనుక రాజకీయ కారణాలు లేవని స్పష్టంచేసింది భాజపా. ఎస్పీజీ భద్రత తొలగింపుపై హోంశాఖ అధికారులే నిర్ణయం తీసుకున్నారని రాజ్యసభలో చెప్పారు ఆ పార్టీ ఎంపీ జేపీ నడ్డా. కాంగ్రెస్​ సభ్యుడు ఆనంద్​ శర్మ... గాంధీల భద్రతలో మార్పుపై అభ్యంతరం వ్యక్తంచేయగా ఈమేరకు స్పందించారు నడ్డా.

లోక్​సభ స్పీకర్ హెచ్చరిక..

లోక్​సభలో అజెండాలో లేని అంశాలపై చర్చ చేపట్టాలని కొంతమంది సభ్యులు పట్టుబట్టగా.. స్పీకర్ ఓంబిర్లా అసహనం వ్యక్తంచేశారు. తన అనుమతి లేకుండా ఎవరూ సీట్ల నుంచి లేవకూడదని సూచించారు. మంగళవారం కూడా సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు స్పీకర్.

ఇదీ చూడండి: నేడు ప్రధానితో శరద్​పవార్​ భేటీ... కారణం ఇదే!

New Delhi, Nov 20 (ANI): NCP chief spokesperson Nawab Malik on November 20 reacted on party supremo Sharad Pawar to meet Prime Minister Narendra Modi. He said that Pawar to discuss and seek financial relief to farmers whose crop was damages due to unseasonal rains.
Last Updated : Nov 20, 2019, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.