ETV Bharat / bharat

యూపీలో మరో ఘోరం- అక్కాచెల్లెళ్లపై యాసిడ్ దాడి

author img

By

Published : Oct 13, 2020, 1:15 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో మరో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తోన్న ముగ్గురు దళిత అక్కాచెల్లెళ్లపై దుండగులు యాసిడ్​ దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వీరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Uttar Pradesh: Three Dalit sisters attacked with acid in Gonda
యూపీలో మరో ఘోరం- దళిత యువతులపై యాసిడ్ దాడి

ఉత్తర్​ప్రదేశ్​లో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా గోండా జిల్లాలోని పక్కా గ్రామంలో ఇంట్లో నిద్రిస్తోన్న ముగ్గురు దళిత అక్కాచెల్లెళ్లపై యాసిడ్ దాడి జరిగింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో అక్కకు తీవ్ర గాయాలు కాగా.. ఇద్దరు చెల్లెళ్లకు స్వల్ప గాయాలయ్యాయి.

స్థానికుల సమాచారంతో హుటాహుటిన గ్రామానికి చేరుకున్న పోలీసులు ముగ్గురినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స చేస్తున్నారని.. యాసిడ్ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: 'హాథ్రస్'​ దర్యాప్తు ముమ్మరం- ఘటనా స్థలానికి సీబీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.