ETV Bharat / bharat

బస్సు-ట్రక్కు ఢీ.. 8 మంది కూలీలు మృతి

author img

By

Published : Sep 5, 2020, 8:27 AM IST

Updated : Sep 5, 2020, 12:41 PM IST

Seven people killed, seven injured after a bus transporting labourers from Ganjam in Odisha to Surat in Gujarat
బస్సు-ట్రక్కు ఢీ.. 8 మంది కూలీలు మృతి

08:24 September 05

బస్సు-ట్రక్కు ఢీ.. 8 మంది కూలీలు మృతి

ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఒడిశా గంజాం నుంచి.. గుజరాత్​లోని సూరత్​కు కార్మికులతో వెళ్తున్న బస్సు రాయ్​పుర్​లోని ఛేరి ఖేడీ వద్ద ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో 20 మందికిపైగా గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికులు, పోలీసులు.. క్షతగాత్రుల్ని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.

ప్రమాద సమయంలో బస్సులో 59 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. 

తలో రూ. 2లక్షలు..

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​.. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. 

Last Updated : Sep 5, 2020, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.