ETV Bharat / bharat

ఇందిరా గాంధీకి కాంగ్రెస్ ప్రముఖుల నివాళులు

author img

By

Published : Oct 31, 2020, 11:08 AM IST

మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీకి నివాళులు అర్పించారు కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ. దిల్లీలోని శక్తి స్థల్​లో ఇందిరాగాంధీకి పూలతో శ్రద్ధాంజలి ఘటించారు ప్రియాంక గాంధీ.

Indira Gandhi
ఇందిరా గాంధీకి కాంగ్రెస్ ప్రముఖుల నివాళులు

మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ 36వ వర్ధంతి సందర్భంగా.. కాంగ్రెస్​ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆమె సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ట్వీట్​ చేశారు సోనియా, రాహుల్​ గాంధీ.

  • asato mā sadgamaya
    tamaso mā jyotirgamaya
    mṛtyor mā amṛtaṃ gamaya

    From the false to truth.
    From darkness to light.
    From death to life.

    Thank you Dadi for showing me what it means to live these words. pic.twitter.com/PBvEeXotew

    — Rahul Gandhi (@RahulGandhi) October 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అసత్యం నుంచి సత్యం.. చీకటి నుంచి వెలుగు.. మృత్యువు నుంచి అమృతత్వం వైపు.. ఈ పదాలతో జీవించడం అంటే ఏమిటో నాకు చూపించినందుకు ధన్యవాదాలు దాదీ"

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

శక్తిస్థల్​ వద్ద ప్రియాంక నివాళులు

దిల్లీలోని ఇందిరా స్మారక శక్తిస్థల్​ వద్ద పూలతో శ్రద్ధాంజలి ఘటించారు కాంగ్రెస్​ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ.

ఇందిరా గాంధీకి ప్రియాంక గాంధీ నివాళి

ఇందిరా గాంధీ 1966-1977 వరకు ప్రధానిగా పని చేశారు. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరానే. మరోమారు 1980లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1984, అక్టోబర్​ 31న అక్బర్​ రోడ్​ లోని ఆమె అధికారిక నివాసంలో ఇద్దరు బాడీగార్డ్స్​ కాల్పులు జరపటం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: ఐక్యతా విగ్రహం వద్ద పటేల్​కు మోదీ నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.