ETV Bharat / bharat

ముంచుకొస్తున్న ముప్పు.. 48 గంటల్లో భారీ వర్షాలు

author img

By

Published : Nov 28, 2020, 3:52 PM IST

బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా.. డిసెంబర్​ 1 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురువనున్నాయని పేర్కొంది.

Low pressure area to intensify into depression, southern states to receive rains next week says IMD
48 గంటల తర్వాత దక్షిణాదిలో భారీ వర్షాలు

దక్షిణ అండమాన్​ సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తమిళనాడులో రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో డిసెంబర్​ 1 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలపింది.

ఈ వాయుగుండం పశ్చిమ దిశగా కదిలి డిసెంబర్​ 2న దక్షిణ తమిళనాడులోని కోస్తా ప్రాంతాన్ని తాకుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల మంగళ, బుధవారాల్లో తమిళనాడు, పుదుచ్చెరిలో కరైకల్​, మహే, లక్షద్వీప్​, ఆంధ్రప్రదేశ్​లోని దక్షిణ తీరం, దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

తమిళనాడు, పుదుచ్చెరి, కరైకల్​లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇదీ చూడండి:'బిలియనీర్లకు ఎర్రతివాచీలు.. రైతులకు గోతులా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.