ETV Bharat / bharat

బిహార్​ రెండోదఫా పోలింగ్​ ప్రశాంతం

author img

By

Published : Nov 3, 2020, 6:31 PM IST

Updated : Nov 3, 2020, 8:38 PM IST

94స్థానాలకు జరిగిన బిహార్​ రెండో దఫా పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలవరకు పోలింగ్​ సాగింది. నితీశ్​ కుమార్​, తేజస్వీ యాదవ్​ వంటి ప్రముఖులు ఈ దఫా పోలింగ్​లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 53.51 శాతం పోలింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Bihar: Second Phase polling completed in 94 constituencies
బిహార్​లో రెండోధపా పోలింగ్​ ప్రశాంతం

బిహార్​ ఎన్నికల రెండోదఫా పోలింగ్​ ముగిసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ మంగళవారం 94స్థానాలకు ఓటింగ్​ జరిగింది. 17జిల్లాల్లో.. సాయంత్రం 5గంటల వరకు 53.51 శాతం పోలింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్​ శాతం ఇంకా పెరిగే అవకాశముందని స్పష్టం చేసింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్​.. సాయంత్రం 6 గంటలకు ముగిసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు ఓట్లు వేశారు.

Bihar: Second Phase polling completed in 94 constituencies
ఓటు వేసేందుకు క్యూలో నిలబడి..

సర్టిఫికెట్ల పంపిణీ..

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు పోలింగ్​ కేంద్రాల్లో వినూత్న చర్యలు చేపట్టారు అధికారులు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజల గౌరవార్థం.. వారికి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.

ఓటేసిన ప్రముఖులు..

బిహార్​ గవర్నర్ ఫాగూ చౌహాన్, సీఎం నితీశ్ కుమార్​, ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్​ మోదీ, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్‌ వంటి ప్రముఖులు ఈ దఫా పోలింగ్​లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Bihar: Second Phase polling completed in 94 constituencies
పట్నాలో తేజస్వీ యాదవ్​ ఓటు
Bihar: Second Phase polling completed in 94 constituencies
దిఘాలో ఓటేసిన నితీశ్​

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్​ తనయులు, ఆర్​జేడీ నేతలు తేజస్వీ యాదవ్, తేజ్​ ప్రతాప్​ యాదవ్​.. ఈ దఫా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.​ రాఘోపుర్​ నుంచి తేజస్వీ,​ హసన్​పుర్​ నుంచి తేజ్​ప్రతాప్​ పోటీలో నిలబడ్డారు. ప్రస్తుత రోడ్డు నిర్మాణశాఖ మంత్రి నంద్​ కిషోర్​ యాదవ్​ పాట్నా సాహెబ్​ నుంచి పోటీ చేశారు.

Bihar: Second Phase polling completed in 94 constituencies
ఖగారియాలో వృద్ధురాలికి సహాయం చేస్తున్న ఐటీబీపీ సిబ్బంది

తొలిదఫాలో..

మొత్తం 243 స్థానాల్లో 71 సీట్లకు ఇప్పటికే ఎన్నికలు జరిగాయి. తొలిదఫాలో భాగంగా 55.69శాతం ఓటింగ్​ నమోదైంది. మిగిలిన నియోజకవర్గాలకు ఈ నెల 7న పోలింగ్​ జరగనుంది. 10న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవీ చూడండి:-

Last Updated : Nov 3, 2020, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.