ETV Bharat / bharat

పిక్నిక్​కు వెళ్తుండగా విషాదం- బస్సు, ట్రక్కు ఢీ- 12 మంది దుర్మరణం

author img

By PTI

Published : Jan 3, 2024, 9:20 AM IST

Updated : Jan 3, 2024, 11:26 AM IST

Assam Bus Accident : అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొట్టుకున్న ఘటనలో 12 మంది మరణించారు.

Assam Bus Accident
Assam Bus Accident

Assam Bus Accident : అసోంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. గోలాఘాట్ జిల్లాలోని దేర్​గావ్ గ్రామంలో బస్సు, ట్రక్కు ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగింది. ఘటనలో మరో 30 మంది గాయపడ్డారని గోలాఘాట్ జిల్లా ఎస్​పీ రాజేన్ సింగ్ తెలిపారు. ఉదయం 5 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని వివరించారు.

assam bus truck accident
ఘటనాస్థలి నుంచి బస్సును తరలిస్తున్న అధికారులు

పిక్నిక్​కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని ఎస్​పీ రాజేన్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. ప్రమాదానికి సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ప్రమాదానికి గురైన లారీ బొగ్గు లోడుతో వెళ్తున్నట్లు సమాచారం.

assam bus truck accident
నుజ్జునుజ్జు అయిన వాహనం

ఘటనాస్థలిలోనే 10 మంది చనిపోగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మృతుల్లో ఎనిమిది మందిని పోలీసులు గుర్తించారు. ట్రక్కు డ్రైవర్ నూర్ ఆలం హక్ సైతం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. 30 మంది క్షతగాత్రులు జొర్హాట్ బోధనాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అక్కడి సీనియర్ వైద్యుడు తెలిపారు. కొందరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు.

  • #WATCH | Assam: At least 12 people died and 25 others injured after a bus collided with a truck in Golaghat district. The accident took place at around 5 am in Balijan area near Dergaon in Golaghat: Rajen Singh, Golaghat SP pic.twitter.com/1F9JavLkJh

    — ANI (@ANI) January 3, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

స్థానిక పోలీస్ స్టేషన్​లోని ఓ అధికారి సమాచారం ప్రకారం బస్సు గోలాఘాట్​లోని కమార్​గావ్ నుంచి తీన్​సుకియాలోని తిలింగ మందిర్​కు వెళ్తోంది. 'బస్సులోని ప్రయాణికులు పిక్నిక్​ కోసం అక్కడికి బయల్దేరారు. ట్రక్కు జొర్హాట్ వైపు నుంచి వస్తుండగా ఘటన జరిగింది. ట్రక్కు డ్రైవర్ తన వాహనాన్ని రాంగ్ రూట్​లో నడిపాడు. నాలుగు లేన్ల రహదారి కాస్త దెబ్బతినడం వల్ల ట్రక్కు రాంగ్ రూట్​లో వచ్చింది. బస్సు సరైన మార్గంలోనే ఉంది. రెండు వాహనాలు హైస్పీడ్​లోనే ఉన్నాయి. భారీగా పొగమంచు కూడా ఉంది' అని అధికారి వివరించారు.

అసోం సీఎం విచారం
ఈ దుర్ఘటనపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. స్థానిక యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

ట్రాక్టర్​తో స్టంట్స్- చక్రాల కిందపడి అక్కడికక్కడే యువకుడు మృతి

ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం- నిద్రిస్తున్న ఆరుగురు కార్మికులు సజీవదహనం

Last Updated : Jan 3, 2024, 11:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.