ETV Bharat / bharat

సాగు చట్టాలపై కర్షక భారతం కన్నెర్ర

author img

By

Published : Dec 8, 2020, 10:55 AM IST

రైతులకు మద్దతుగా యావత్​ దేశం నిరసనలతో హోరెత్తింది. దాదాపు 25 రాజకీయ పార్టీలు సహా అనేక సంఘాలు భారత్​ బంద్​లో పాల్గొన్నాయి. అన్నదాతలకు మద్దతుగా ఆందోళనలు నిర్వహించాయి. మహారాష్ట్ర, బంగాల్​, ఒడిశాలో రైల్​ రోకో నిర్వహించారు నిరసనకారులు. బంద్ నేపథ్యంలో దిల్లీ సరిహద్దులో బలగాలను భారీగా మోహరించారు.

agitating-farmers-call-for-bharat-bandh-today
రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘూలు తలపెట్టిన భారత్​ బంద్​కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. దాదాపు 25 రాజకీయ పార్టీలు, రైతు, కార్మిక సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. రైతుల డిమాండ్​ మేరకు సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని నినదించాయి. పలు చోట్ల రైల్​ రోకో నిర్వహించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు నిరనసకారులు.

మహారాష్ట్రలో..

agitating-farmers-call-for-bharat-bandh-today
రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు

భారత్​ బంద్​కు మద్దతుగా మహారాష్ట్రలోని 'స్వాభిమాని శెట్కారి సంఘటన' రైతు సంఘం రైల్​ రోకో నిర్వహించింది. బుల్ధానా జిల్లా మల్కాపుర్​లోని రైల్వే స్టేషన్లో ట్రాక్​పై ఆందోళనలు చేపట్టింది. ఓ రైలును బయల్దేరకుండా నిరసనకారులు అడ్డుకోగా.. రంగంలోని దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

agitating-farmers-call-for-bharat-bandh-today
రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు

ఒడిశాలో..

agitating-farmers-call-for-bharat-bandh-today
రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు

రైతులకు మద్దతుగా ఒడిశా భువనేశ్వర్​లో రైల్​ రోకో నిర్వహించాయి వామమక్షాలు. భువనేశ్వర్​ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలను అడ్డుకున్నాయి. కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఇందులో పాల్గొన్నాయి.

agitating-farmers-call-for-bharat-bandh-today
రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు

కర్ణాటకలో..

agitating-farmers-call-for-bharat-bandh-today
రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు

భారత్ బంద్​కు మద్దతుగా కర్ణాటకలో కాంగ్రెస్​ నేతలు ఆందోళనలు నిర్వహించారు. బెంగళూరు విదాన్​ సౌధ వద్ద గాంధీ విగ్రహం ముందు నల్ల జెండాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నూతన సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు సిద్ధరామయ్య, బీకే హరిప్రసాద్​, రామలింగా రెడ్డి ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

agitating-farmers-call-for-bharat-bandh-today
రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు

కర్ణాటక కలబురిగిలో వామమక్ష అనుబంధ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశాయి.

బంగాల్​లో..

agitating-farmers-call-for-bharat-bandh-today
రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు
agitating-farmers-call-for-bharat-bandh-today
రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు

బంగాల్​ రాజధాని కోల్​కతాలోని జాదవ్​పుర్ రైల్వే స్టేషన్లో వామపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. భారత్​ బంద్​కు మద్దతుగా రైల్​ రోకో చేపట్టాయి. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశాయి.

బిహార్​లో

బిహార్​లో ప్రతిపక్ష ఆర్జేడీ.. రైతులకు మద్దతుగా ఆందోళనలు నిర్వహించింది. దర్భంగాలోని గన్​చౌక్​ వద్ద టైర్లకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు ఆ పార్టీ కార్యకర్తలు. భారత్ ​బంద్​కు మద్దతు తెలిపారు.

agitating-farmers-call-for-bharat-bandh-today
రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు

దిల్లీలో బందోబస్తు..

agitating-farmers-call-for-bharat-bandh-today
దిల్లీలో బందోబస్తు

భారత్ బంద్ నేపథ్యంలో దిల్లీలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. సింఘు, టిక్రీ, ఘాజిపూర్ సహా పలు దిల్లీ సరిహద్దు రోడ్లను మూసివేశారు.

agitating-farmers-call-for-bharat-bandh-today
దిల్లీలో బందోబస్తు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.