ETV Bharat / bharat

ఐదేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. ఆపై

author img

By

Published : Jul 6, 2021, 9:58 AM IST

ఓ కామంధుడి కర్కశత్వానికి అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారి బలైపోయింది. బాధితురాలి ఇంటి పొరుగున ఉన్న వ్యక్తే మృగంలా ప్రవర్తించి కిరాతకంగా హత్యాచారం చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

rape and murder
ఐదేళ్ల బాలికపై హత్యాచారం

మధ్యప్రదేశ్​ మోరెనా జిల్లాలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి.. హత్యకు పాల్పడ్డాడు ఓ కిరాతకుడు.

ఇదీ జరిగింది

ఆ చిన్నారి.. రొట్టెను కొనేందుకు తన ఇంటికి సమీపంలోని దుకాణానికి వెళ్లింది. అయితే గంటన్నర దాటినా ఇంకా ఇంటికి వెళ్లలేదు. దీంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. కానీ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. ఆ దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించగా.. చోటూ తోమర్​ అనే వ్యక్తి ఆ బాలికను తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో స్థానికులంతా తోమర్​ ఇంటికి వెళ్లారు. అక్కడే విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ బాలిక చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: దేశంలో 111 రోజుల కనిష్ఠానికి కొత్త కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.