ETV Bharat / bharat

92ఏళ్ల వృద్ధురాలి కడుపులో 15కేజీల కణతి​!

author img

By

Published : Jan 16, 2021, 4:37 PM IST

రాంచీలో ఓ వృద్ధురాలి కడుపులోంచి 15 కిలోల కణతి​ని వైద్యులు తొలగించారు. ఆధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్యులు ఉండటం వల్లే ఇది సాధ్యమైందని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది.

jharkhand, ranchi, surgery
92 ఏళ్ల వృద్ధురాల కడుపులో 15కేజీల ట్యూమర్​!

ఝార్ఖండ్​ రాజధాని రాంచీలోని రాజ్​ ఆస్పత్రి వైద్యులు 92ఏళ్ల వృద్ధురాలి కడపులోంచి 15 కేజీల ట్యూమర్​ను తొలగించారు. ఆమె వయసు దృష్ట్యా ముందు శస్త్రచికిత్స చేసేందుకు సందేహించామని.. కానీ ఆరోగ్యస్థితి మరింత క్షీణిస్తుండటం వల్ల కణతి​ని తొలగించామన్నారు.

డాక్టర్​ పీకే రైనా, డాక్టర్ ఆశీష్ కుమార్​ మోదీ సహా 8 మంది సభ్యుల వైద్య బృందం శుక్రవారం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది.

ఈ ఆపరేషన్​ చాలా క్లిష్టమైనదని ఆస్పత్రి ఛైర్మన్​ జోగేష్​ గంభీర్​ అన్నారు. ఆధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్యులు ఉండటం వల్ల ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.

jharkhand, ranchi, surgery
వృద్ధురాలితో వైద్య సిబ్బంది

"కొన్ని నెలలుగా ఆమె ట్యూమర్​తో బాధపడుతోంది. కానీ ఇదివరకు సంప్రదించిన వైద్యులంతా తన వయసు కారణంగా శస్త్రచికిత్సకు నిరాకరించారు. రాజ్​ ఆస్పత్రిని సంప్రదించగా వారు పరీక్షలు చేసి, తక్షణమే శస్త్రచికిత్స చేయాలన్నారు."

-రోగి బంధువులు

ఈ సందర్భంగా రోగి బంధువులు వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి : కొవిడ్​ వచ్చి పోయింది.. మరి టీకా వేయించుకోవాలా?

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.