ETV Bharat / bharat

అయోధ్యకు 1430కి.మీ రన్​- సనాతన ధర్మంపై అవగాహనే లక్ష్యం!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2024, 2:26 PM IST

Updated : Jan 3, 2024, 3:14 PM IST

1430 KM Shraddha Run To Ayodhya : ప్రజల్లో సనాతన ధర్మంపై అవగాహన పెంచాలనే లక్ష్యంతో ఏకంగా 1430కి.మీ సుదీర్ఘమైన మారథాన్​కు శ్రీకారం చుట్టింది గుజరాత్​కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ. నవ్​సారి జిల్లా నుంచి ప్రారంభమైన ఈ పరుగు యాత్ర​ యూపీలోని అయోధ్యకు 20 రోజుల్లో చేరుకోనుంది. ఈ ఈవెంట్​లో మొత్తం 30 మంది ప్రభుత్వ ఉద్యోగార్థులు పాల్గొంటున్నారు.

1430 Kms Shraddha Run To Ayodhya From Gujarat Navsari District Organizing By Pragathi Charitable Trust From Bilimora
1430 Kms Marathon To Ayodhya

అయోధ్యకు 1430కి.మీ రన్​ మారథాన్​

1430 KM Shraddha Run To Ayodhya : అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి రన్నింగ్​ ద్వారా వెళ్లేందుకు సిద్ధమయ్యారు గుజరాత్​ నవ్​సారి జిల్లాకు చెందిన కొందరు యువతీయువకులు. జిల్లాలోని బిలిమోరా ప్రాంతం నుంచి ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్య రామమందిరానికి పరుగు ద్వారా చేరుకునే కార్యక్రమానికి తాజాగా శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర మొత్తం 1430 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. శ్రద్ధా రన్​ పేరుతో ఈ మారథాన్​ను నిర్వహిస్తున్నారు.

1430 Kms Shraddha Run To Ayodhya
శ్రద్ధా రన్​ యాత్రలో పాల్గొంటున్న యువత

"ప్రస్తుతం నేను ఆర్మీకి సిద్ధమవుతున్నా. మేము బిలిమోరాలోని సోమనాథ్​ మహాదేవ్​ ఆలయం నుంచి అయోధ్యలోని రామమందిరం వరకు చేపట్టిన పరుగు యాత్రలో పాల్గొంటున్నాము. ఇది మాకు ఎంతో గర్వకారణం, సంతోషకరం. ఈనెల 22న జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మేము హాజరవుతాము."
- ఆర్తీ, రన్నర్​

ఈ మారథాన్​ కార్యక్రమాన్ని నవ్​సారి జిల్లా బిలిమోరాకు చెందిన ప్రగతి చారిటబుల్ ట్రస్టు నిర్వహిస్తోంది. వీరి ఆధ్వర్యంలోనే మొత్తం 30 మంది బిలిమోరా నుంచి పరుగు ద్వారా అయోధ్యకు చేరుకునేందుకు ముందడుగు వేశారు. ఇందులో 26 మంది యువకులు కాగా, మిగతా నలుగురు యువతులు ఉన్నారు.

1430 Kms Marathon To Ayodhya
1430 కి.మీల రన్​ మారథాన్​ను ప్రారంభిస్తున్న స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు

"ఈ పరుగు యాత్రలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము బిలిమోరా నుంచి 1430 కి.మీ దూరంలో ఉన్న అయోధ్యకు రన్నింగ్​ ద్వారా చేరుకుంటాము. 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొంటున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఈ రేసులో ప్రతిరోజూ 80 నుంచి 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నాం. ఈ మారథాన్​ కోసం గత 3-4 నెలలుగా మేము సిద్ధమవుతున్నాము."
- ఓం పటేల్, అథ్లెట్​

ఈ యాత్ర పూర్తి కావడానికి కనీసం 20 రోజులు పడుతుందని అంచనా. ఈ రన్​ మారథాన్​ బృందం శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవ సమయానికి అక్కడకు చేరుకుంటుంది. వీరందరికీ మార్గమధ్యంలో కావాల్సిన ఆహారం, నీరు వంటి అవసరాలను తీర్చేందుకు 10 మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు ట్రస్టు అధ్యక్షుడు​ నాటు సోసా.

1430 Kms Shraddha Run To Ayodhya
పరుగు యాత్రలో పాల్గొంటున్న యువకులు

"1430 కి.మీ దూరం ఉన్న అయోధ్యకు పరుగు ద్వారా చేరేందుకు మా ట్రస్టు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బిలిమోరా నుంచి దీనిని ప్రారంభించాము. ఈ ఈవెంట్​లో 26 మంది అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు పాల్గొంటున్నారు. మార్గమధ్యలో వీరికి సాయం అందించేందుకు 10 మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు."
- నాటు సోసా, ప్రగతి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు

ఈ సుదీర్ఘమైన మారథాన్ నిర్వహించడం వెనక ఉన్న ప్రధాన లక్ష్యం- సనాతన ధర్మంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే అని అంటున్నారు ప్రగతి చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు.

అయోధ్య రాముడి విగ్రహ ఎంపికపై క్లారిటీ- ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఆలయ ట్రస్ట్

అయోధ్యకు 1008 కి.మీ పరుగు- యువతలో ఆధ్యాత్మికత, ఫిట్​నెస్​ పెంపే లక్ష్యంగా మారథాన్​

Last Updated : Jan 3, 2024, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.