ETV Bharat / bharat-news

'ఎంపీలను నిలదీయండి'

author img

By

Published : Feb 27, 2019, 1:02 PM IST

Updated : Feb 27, 2019, 1:26 PM IST

జాతీయ యువజనోత్సవ వేడుకలు-2019లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రాజ్యసభ ఉత్పాదకత ఎందుకు తక్కువగా ఉందో సభ్యులను నిలదీయాలని యువతకు సూచించారు.

జాతీయ యువజనోత్సవాల్లో మోదీ

దిల్లీ విజ్ఞాన్​ భవన్​లో జరిగిన జాతీయ యువ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ముగ్గురు విద్యార్థులకు యువ అవార్డులు ప్రదానం చేశారు మోదీ. ఇదే వేదికపై ఖేలో ఇండియా యాప్​ను ప్రారంభించారు. అనంతరం యువత అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు ప్రధాని.

జాతీయ యువజనోత్సవాల్లో మోదీ

"16వ లోక్​సభ కాలంలో ఉత్పత్తి 85శాతం పెరిగింది. 205 బిల్లులు ఆమోదం పొందాయి. 15వ లోక్​సభతో పోలిస్తే 20 శాతం అధికంగా పని చేశాం. దీనిపై సంతోష ఏం లేదు. 200 శాతంగా ఉంటే బాగుండేది. పూర్తి మెజారిటీ ఇస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. రాజ్యసభలో ఏమైంది. అది పెద్దల సభ. అక్కడ ఫలితం తిరగబడింది. కేవలం 8శాతం మాత్రమే మెరుగుపడింది. " -నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

Intro:Body:Conclusion:
Last Updated : Feb 27, 2019, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.