Pratidhwani: ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనలు.. ప్రజల్లో ఆందోళనలు
రాష్ట్రంలో ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనలపై ఆందోళనల జడి ఆగడం లేదు. ఉన్న అద్దె ఆధారిత విధాన స్థానంలో రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్నును తీసుకువస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ మేరకు స్థానిక సంస్థలకు ముసాయిదా నోటిఫికేషన్లనూ పంపించారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది నోటిఫికేషన్కు కసరత్తులు చేస్తున్నారు. ఇదే విషయంపై ప్రజాసంఘాలు, విపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం కొత్త పద్దతే మేలు అంటుంటే... రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్నులతో వాతలే అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.