డిజిటల్ కరెన్సీకి, క్రిప్టోలకు మధ్య తేడా.. వీటితో ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ప్రమాదమేంటి ?
PRATHIDHWANI: క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. బిట్ కాయిన్, ఎథెరియం వంటి పేర్లతో చెలామణి అవుతున్న క్రిప్టోలపై రిజర్వ్ బ్యాంక్ చేసిన సూచనల మేరకు నిషేధం అవసరమని భావిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు. అయితే ఇప్పటికే క్రిప్టో ట్రేడింగ్ ద్వారా ఇందులో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల్లా తయారైంది. ఈ పరిస్థితుల్లో అసలు దేశంలో క్రిప్టో కరెన్సీల విలువ ఎంత మొత్తంలో ఉంది. వీటితో ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ప్రమాదం ఏంటి? ప్రభుత్వం కొత్తగా తీసుకురావాలనుకుంటున్న డిజిటల్ కరెన్సీకి, ఈ క్రిప్టోలకు మధ్య తేడా ఏంటనే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని.