YCP Leaders Demolished Walls: ఇంటి గోడలు కూల్చి.. ఖాళీ చేయాలంటూ బెదిరిస్తూ

By

Published : Jul 2, 2023, 1:18 PM IST

thumbnail

YSRCP Leaders Demolished House Walls : గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో అధికార పార్టీ నాయకులు రెచ్చిపోయారు. తన ఇంటి గోడలు కూల్చారని ఓ కుటుంబం ఆరోపిస్తోంది. పేరేచర్ల గ్రామానికి చెందిన మందా కనికరం కుటుంబ సభ్యులు 1993 సంవత్సరంలో వాగు పోరంబోకులో రెండు సెంట్లు స్థలం కొనుగోలు చేశారు. కొన్ని సంవత్సరాలుగా అక్కడ పూరిపాక వేసుకొని నివాసం ఉంటున్నారు. ఇటీవల ఆ స్థలంలో రేకులు ఇల్లు కట్టుకునేందుకు సిమెంట్‌ ఇటుకలతో గోడలు కట్టారు. అయితే ఈ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ కొంత కాలంగా కొందరు వైఎస్సార్సీపీ నాయకులు దేవరకొండ సరోజిని, ఆమె భర్త బాబురావు మందా కనికరంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో శనివారం జేసీబీ సాయంతో అక్రమంగా ఇంటి గోడలు కూల్చారని బాధితురాలు వాపోయారు. ఎందుకు కూలుస్తున్నారని అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారని, బూతులు తిట్టారని బాధితురాలు మందా కనికరం ఆరోపించింది. దీనిపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో దేవరకొండ సరోజిని, ఆమె భర్త బాబురావు, వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.