YCP Leaders Attacked on Retired Army Employee : పెచ్చుమీరుతున్న వైసీపీ నేతల ఆగడాలు.. విశాంత్ర ఆర్మీ ఉద్యోగిపై రాడ్లు, కత్తులతో దాడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2023, 1:09 PM IST

thumbnail

YCP Leaders Attacked on Retired Army Employee in Vizag : అధికార వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా పద్మనాభం మండలం రేవిడి సచివాలయం రౌతులపాలెంలో విశ్రాంత ఆర్మీ ఉద్యోగి మోపాడ ఆదినారాయణపై వైసీపీ నాయకులు కత్తులు, రాడ్లతో దాడి చేశారు. సర్పంచ్ కోన సూరమ్మ అనుచరులే తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. సర్పంచ్​ కుమారుడు కోన రమణ అక్రమాలు రోజురోజుకీ ఎక్కువైపోయాయన్నారు. గ్రామంలో ప్రభుత్వ భూములు, కాలువలు తన పేరిట, తన బంధువుల పేరిట ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని ఆరోపించారు. వీటిని స్పందనలో ఫిర్యాదు చేయడంతోనే గత రాత్రి రెక్కీ నిర్వహించి తనపై దాడి చేసినట్లు ఆదినారాయణ తెలిపారు. హత్య చేయడానికి దుండగులను ఏర్పాటు చేసిన సర్పంచ్​ కుమారుడితో పాటు దాడికి పాల్పడిన వారిపైనా చర్యలు తీసుకోవాలని అదినారాయణ డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయాలపాలైన ఆదినారాయణ ప్రస్తుతం తగరపువలసలోని నీరుకొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.