YCP Leaders Attack on SCs in Annamayya District: అన్నమయ్య జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. ఎస్సీలపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2023, 10:08 AM IST

thumbnail

YCP Leaders Attack on SCs in Annamayya District: భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారన్న కక్షతో.. వైసీపీ నేత, ఆయన అనుచరులు.. ఎస్సీ వర్గానికి చెందిన 10మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కొమ్మివారిపల్లి ఎన్టీఆర్ కాలనీలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎన్టీఆర్ కాలనీ సమీపంలోని సర్వే నంబర్ 1584లో 47ఎకరాల 97సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. ఆరేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వం అందులో 16మంది ఎస్సీలకు నివాస పట్టాలిచ్చింది. వైసీపీ అధికారం వచ్చాక.. ఆ భూమిపై ఉమ్మడి కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి ముఖ్య అనుచరుడి కన్నుపడింది. 

స్థలం ఆక్రమించి, అందులో నివాసాలు నిర్మించి ఇతరులకు అమ్మేశారు. ఈ విషయంపై అదే గ్రామంలోని ఎస్సీలు పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాధ్యుడికి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో గ్రామ వైసీపీ నాయకులు మాపైనే ఫిర్యాదు చేస్తారా.. అంటూ కర్రలు, ఇనుప రాడ్లతో ఎస్సీలపై దాడి చేసి గాయపరిచారు. బాధితులను రాజంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారు అంతటితో ఆగకుండా ఎలాంటి గాయాలు లేని వైసీపీ నాయకులను ఆసుపత్రిలో చేర్చి.. తమపై తప్పుడు కేసు పెట్టించేందుకు యత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.