Women Bike Rally to Raise Breast Cancer Awareness: రొమ్ము క్యాన్సర్​పై అవగాహన.. విశాఖలో మహిళల బైక్ థాన్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 8, 2023, 2:24 PM IST

thumbnail

Women Bike Rally to Raise Breast Cancer Awareness: రొమ్ము క్యాన్సర్​పై అవగాహన కల్పిస్తూ విశాఖలో మహిళలు బైక్ థాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెచ్​సీజీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ థాన్​ను మేయర్ హరివెంకట కుమారి జెండా ఊపి ప్రారంభించారు. బీచ్ రోడ్ ఉడా పార్క్ నుంచి తెన్నేటి పార్క్ వరకు సాగిన ఈ బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా పరిగణిస్తున్న సందర్భంగా హెచ్​సీజీ క్యాన్సర్ సెంటర్​లో ఉచితంగా మహిళలకు క్యాన్సర్ పరీక్షలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నెలరోజుల పాటు ఉచితంగా నిర్వహించే క్యాన్సర్ పరీక్షలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మేయర్ తెలిపారు.

"రొమ్ము క్యాన్సర్ బారిన పడి దేశంలో ప్రతి సంవత్సరం వేలల్లో మహిళలు మరణిస్తున్నారు. మహిళల్లో సరైన అవగాహన లేకపోవడం, కొంతమందికి బయటకు చెప్పుకోవటం ఇష్టం లేకపోవటం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది. హెచ్​సీజీ క్యాన్సర్ సెంటర్​లో ఉచితంగా మహిళలకు క్యాన్సర్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. నెలరోజుల పాటు ఉచితంగా నిర్వహించే క్యాన్సర్ పరీక్షలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము." - హరివెంకట కుమారి, మేయర్ 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.