తిరుమలకు వీఐపీల తాకిడి - శ్రీవారిని దర్శించుకున్న జమ్ము కాశ్మీర్​ గవర్నర్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2024, 5:59 PM IST

thumbnail

VIPs for Tirumala Srivari Darshan : నూతన సంవత్సరం పర్వదినం పురస్కరించుకొని తిరుమలకు వీఐపీ తాకిడి పెరిగింది. కలియుగ వైకుంఠ వాసుని జమ్ము కాశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా కుటుంబ సభ్యులతో పాటు దర్శనం చేస్తుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం లెఫ్టినెంట్​​ గవర్నర్​తో పాటు కుటుంబ సభ్యులకు రంగనాయకుల మండపంలో పండితుల వేద ఆశ్వీర్వచనం చేసి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

People Visit Srivari on New Year's Day : సామాన్య ప్రజల నుంచి రాజకీయ నేతల వరకు శ్రీవారి దర్శనం చేసుకోవడం వల్ల ఆలయ ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. రద్దీని దృష్టిలో పెట్టుకొని అధికారులు అప్రమత్తం అయ్యి భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు. ఉదయం తెలంగాణ గవర్నర్​ తమిళసై, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీజేపీ నేత కిషన్​ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు విశాఖ శారద పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి, సినీ నటుడు సుమన్​ కలియుగ వాసుడిని దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.