TDP on IPAC Organization సొమ్ము సర్కార్​ది.. ప్రచారం పార్టీకి! ఐప్యాక్ కు 274కోట్లు దోచిపెట్టిన జగన్..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2023, 8:11 AM IST

thumbnail

TDP Alleges YSRCP Govt Given Money to IPAC Organization: ఐప్యాక్‌ సంస్థకు 274 కోట్ల ప్రభుత్వ సొమ్మును వైసీపీ దోచిపెట్టిందని తెలుగుదేశం ఆరోపించింది. వైసీపీ ప్రచారం కోసం పనిచేస్తున్న ఐ-ప్యాక్ సంస్థకు.. వాలంటీర్లపై పర్యవేక్షణ పేరుతో ఏటా 68కోట్ల రూపాయల చొప్పున ప్రజాధనాన్ని మళ్లించారని ఆరోపణలు గుప్పించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డే ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి అని ధ్వజమెత్తింది.  

వాలంటీర్లపై పర్యవేక్షణ పేరుతో జిల్లాల వారీగా నియమించిన ఐప్యాక్ సిబ్బందికి.. ప్రభుత్వ ఖజానా నుంచి అక్రమంగా జీతాలు చెల్లిస్తున్నారని తెలుగుదేశం ఆరోపించింది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన ఆ పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్.. మొత్తం 274కోట్ల ప్రభుత్వ సొమ్ము మళ్లించారని అన్నారు. మూడు షెల్ కంపెనీలను కన్సార్షియంగా ఏర్పాటుచేసి.. అందులో ఓ సంస్థకు జీవో ఇచ్చి మరీ ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు చెల్లించినట్లు చెప్పారు. వాలంటీర్లపై పర్యవేక్షణ కోసమంటూ నియమించిన ఐప్యాక్‌ సిబ్బందికి.. షెల్ కంపెనీల కన్సార్షియంలోని రామ్ ఇన్ఫో సంస్థ ద్వారా జీతాలు చెల్లించినట్లు వివరించారు.

మూడు సంస్థల్ని ఎఫ్​ఓఏగా పేర్కొన్న ప్రభుత్వం.. ఈ సేవల వినియోగం కోసం నిబంధనలేమైనా పాటించిందా అని విజయ్‌కుమార్ ప్రశ్నించారు. టెండర్లు పిలవడంతోపాటు 274కోట్ల చెల్లింపులకు అసెంబ్లీ, కేబినెట్ అనుమతి ఉందా అని నిలదీశారు.  డిజిటల్ కార్పొరేషన్ సొమ్ములతో వైసీపీ సోషల్ మీడియా సోకులు పోతోందన్న విజయ్‌కుమార్‌.. ఈ కుంభకోణాన్ని త్వరలోనే బయటపెడతామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.