వచ్చే ఏడాదికి ఏపీ అప్పులు రూ.10 లక్షల కోట్లు దాటిపోతుంది: యనమల రామకృష్ణుడు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 5:38 PM IST

thumbnail

TDP Leader Yanamala on State Financial Situations: ఆంధ్రప్రదేశ్ అప్పు రోజురోజుకు పెరిగిపోతోందని.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని తాను ప్రభుత్వాన్ని కోరినా.. ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని ఆగ్రహించారు. ఎన్నికల నాటికి వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పు చేసి.. ఏడాదికి రూ.50 వేల కోట్లు వాయిదాలు కట్టే పరిస్థితిని తీసుకురాబోతుందని ఆయన ఆరోపించారు.

Yanamala Ramakrishnudu Comments: ''రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు అప్పుల భారం లెక్కలేనంతగా పెరిగిపోతోంది. 2018-19 నాటికి ప్రభుత్వ గ్యారంటీలు రూ.50 వేల కోట్ల లోపు ఉంటే, గత సంవత్సరం చివరి నాటికే.. లక్షా 50 వేలకు కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, అప్పులు ఇచ్చిన బ్యాంకులు, కాగ్ వంటి సంస్థలు వెంటనే స్పందించి వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి.. నియంత్రించాలని కోరుతున్నాను. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం గ్యారంటీలు ఇస్తే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. వచ్చే ఏడాదికి రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లు దాటిపోతుంది. ప్రభుత్వ గ్యారంటీలు సైతం రూ.2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది'' అని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.