TDP Leader Bandaru Satyanarayana: పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారు.. బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి మాధవీలత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 2, 2023, 4:20 PM IST

Updated : Oct 2, 2023, 8:21 PM IST

thumbnail

TDP Leader Bandaru Satyanarayana: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ఎలాంటి నోటీసూ ఇవ్వకుండా గత రాత్రి నుంచి పోలీసులు తమను నిర్బంధించారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డీఎస్పీ సత్యనారాయణ, పోలీసులు తమను భయభ్రాంతులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల పాటు తన భర్త బండారు సత్యనారాయణ మూర్తినిఏ విధమైన నోటీసు ఇవ్వకుండా గృహనిర్బంధం చేశారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు బండారు (Bandaru) మీద పోలీస్ స్టేషన్​లో కానీ, పరవాడ లిమిట్​లో గాని, లేకుండా ఎందుకు గృహనిర్బంధం విధించారనే విషయం తనకు తెలపాలని డిమాండ్ చేశారు. సుమారు 200 మంది పోలీసులు ఇంటి చుట్టూ భయాందోళన కలిగించారని ఆరోపించారు. భవిష్యత్తులో తన భర్త ప్రాణాలకు సంబంధించి భయాందోళన గురవుతున్నట్టుగా మాధవీలత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చాలాసేపటి నుంచి పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ అధికారులు ఎవరూ స్పందించలేదని తెలిపారు. కనీసం ఫిర్యాదు తీసుకున్నదానికి రసీదు కూడా ఇవ్వలేదని,  బండారు సత్యనారాయణమూర్తి సతీమణి మాధవిలత ఆవేదన వ్యక్తం చేశారు.

Last Updated : Oct 2, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.