'పొలానికి వెళ్తున్నాని చెప్పాడు - తెల్లారేసరికి శవమయ్యాడు' దళిత సంఘ నాయకుల ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2023, 5:31 PM IST

thumbnail

Suspicious death of farmer : తూర్పుగోదావరి జిల్లా పంట పొలాల్లో అనుమానస్ఫదంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. చాగల్లు మండలం చంద్రవరం గ్రామానికి చెందిన జొన్న కూటీ లక్ష్మణ్​ ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్లాడు. కాగా, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పొలాల్లో పడేశారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని లక్ష్మణ్​ మృతదేహన్ని పరిశీలించారు. అతని ద్విచక్రవాహనం ముందు భాగం ధ్వంసమైయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 

Dalit Community Leaders Demand Justice for the Victim's Family : లక్ష్మణ్ మృత దేహన్ని శవ పరీక్షలు నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్నామని పేర్కొన్నారు. లక్ష్మణ్​ మృతి చెందడానికి కారణమైన వారిని శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయలని దళిత సంఘం నేతలు డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.