హోరాహోరీగా కబడ్డీ పోటీలు - సత్తా చాటిన మహిళలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 12:18 PM IST

thumbnail

State Women Kabaddi Competitions Held In Prakasam due to Christmas: ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సంతరావూరులో క్రిస్మస్​ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. ఈ పోటీలను ఏలూరి యువసేన ఆధ్వర్యంలో మూడు రోజులపాటు  ఫ్లడ్ లైట్ల (Flood Lights) వెలుతురు మధ్య నిర్వహించారు. క్రీడా పోటీల ముగింపు వేడుకలకు పర్చూరు ఎమ్మెల్యే (MLA) ఏలూరి సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 

Kabaddi Matches Concluded Under Flood Lights:  ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతుూ గ్రామీణ స్థాయిలో ఇటువంటి పోటీలు నిర్వహించడం హర్షణీయం అన్నారు. మనిషి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు చాలా ముఖ్యమని, క్రీడల మనిషికి శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం, ఒత్తిడి తట్టుకునేలా సహకరిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ఏలూరి యువసేన ఏ, బి జట్లు మధ్య హోరాహారీగా కబడ్డీ ఫైనల్ పోటీలు జరిగాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.