తండ్రి పాలిట కాలయముడైన కుమారుడు - మంచంపైనే చంపి డీజిల్ పోసి తగులబెట్టాడు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 1:01 PM IST

thumbnail

Son Killed Father For Property: కన్న కొడుకే తండ్రి పాలిట కాలయముడయ్యాడు. ఆస్తి కోసం అత్యంత కర్కశంగా తండ్రిని చంపి మంచంపైనే డీజిల్ పోసి తగులబెట్టిన ఘటన భవదేవరపల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Burnt with Diesel on Bed: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా నాగాయలంక మండలం భవదేవరపల్లిలో బండి హరి మోహన్​రావు(50) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం మోహన్ రావు భార్య మృతి చెందింది. వీరి తనయుడు పవన్ కల్యాణ్ తాపీ పని చేస్తున్నాడు. తండ్రీకుమారుల మధ్య కొంతకాలంగా  ఆస్తి కోసం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పవన్ శుక్రవారం రాత్రి ఏడున్నర గంటలకు ఇంట్లోనే తండ్రిని చంపి, మంచం మీదే నిప్పుపెట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు మంటను అదుపు చేసే సరికేే మోహన్​రావు మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పవన్​కు గతంలోనూ నేరచరిత్ర ఉందని, ఆస్తి కోసమే తండ్రిని పవన్ హత్య చేసినట్టు ప్రాధమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.