నాలుగుసార్లు సర్పంచులుగా పనిచేశాం - ఇంతటి దరిద్రపుగొట్టు ప్రభుత్వాన్ని చూడలేదన్న వైసీపీ సర్పంచ్
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2023, 12:27 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-12-2023/640-480-20206007-thumbnail-16x9-sarpamch-fire-on-ycp-government-in-satyasai-district.jpg)
Sarpamch Fire On YCP Government In Satyasai District : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు పనులు కల్పించాల్సిన నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆ పార్టీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జరిగిన సర్పంచ్ల శంఖారావం కార్యక్రమంలో పలు సర్పంచ్లు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ నాలుగు పర్యాయాలు తమ కుటుంబం నుంచి సర్పంచులుగా పని చేశామని ఇంతటి దరిద్రపుగొట్టు ప్రభుత్వాన్ని చూడలేదంటూ కురుమామిడి సర్పంచ్ సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Sarpanch Meeting On YSRCP Govt Problems : కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు కేటాయించే నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించి సంక్షేమ పథకాల పేరిట డబ్బులు ఇస్తూ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. బటన్ నొక్కుతూ పంచుతున్న డబ్బులు స్థానిక సంస్థల నిధులని ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.