Sanitation Workers Protest in Madasikara: మడకశిరలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన.. కార్యాలయానికి తాళం

By

Published : Aug 1, 2023, 5:45 PM IST

thumbnail

Municipal Wokers Protest In Madakasira: శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర మున్సిపల్​ కార్యాలయంలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు.. తమ సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మడకశిర మున్సిపల్​ కార్యాలయాన్ని ముట్టడించి.. ఆఫీస్​కు తాళం వేశారు. ఆనంతరం  కార్యాలయం​ ఎదుట బైఠాయించిన కార్మికులు.. జగన్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి వారి నిరసనను తెలిపారు.  తమ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారికి వినతి పత్రం అందించారు. చాలా కాలంగా కాంట్రాక్ట్, అవుట్​ సోర్సింగ్​​లో పని చేస్తున్న మున్సిపల్​ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్​ చేశారు.. కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వాలని కోరారు. రక్షణ పరికరాలు, భద్రత సౌకర్యాలను సకాలంలో అందించాలని జగన్​ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.  ఎన్నో సంవత్సరాలుగా అదే మున్సిపల్​ ఆఫీస్​లో పని చేస్తున్న కార్మికుల జీతాలను పెంచాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్​ కార్మికులకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.