పశుపక్ష్యాదులకూ పండగే - ఆ ఊరిలో 'సల్ల' తర్వాతే సంక్రాంతి
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 16, 2024, 12:34 PM IST
|Updated : Jan 16, 2024, 3:34 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-01-2024/640-480-20519225-thumbnail-16x9-salla-program-in-chittor-district.jpg)
Salla Program In Chittoor District: సంక్రాంతి పండుగను ఆ ఊరిలో విభిన్నంగా జరుపుకొంటారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంక్రాంతికి ముందుగా జరుపుకొనే సల్ల అనే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి గ్రామంలోనూ సూర్యోదయానికి ముందే సల్లను నైవేద్యంగా పెట్టి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆ సల్లను నీటి బావులు, చెరువులు, ఇంటిపైన వేస్తారు. ఈ సల్ల కార్యక్రమం పూర్తయిన తర్వాతనే చిత్తూరులో సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తారు.
గ్రామాల్లో సూర్యోదయానికి ముందే స్నానాలు ఆచరించి వేడి దోసెలు సిద్ధం చేస్తారు. ఇంటి గడప, పూజగది, పశువుల కొట్టంలో వేపాకు వేసి, దోసెలు, అన్నం ముద్ద, కొంచెం పెరుగు ఉంచి దూపంతో పూజలు చేస్తారు. అందరు కలిసి సల్లో సల్ల అంటూ నినాదాలు చేస్తూ, మూకుమ్మడిగా వాటిని తీసుకెళ్లి బావులు, చెరువులో వేస్తారు. బావులు, చెరువుల్లోని చేపలు, కప్పలు వంటి జలచరాలకు ఇది ఆహారంగా భావించి అందులో వదులుతారు. మరో సల్లను పక్షుల కోసం ఇంటి పైకప్పుపై వేస్తారు. పశువులకూ పెడతారు. ఇంకో సల్లను ప్రసాదంగా స్వీకరిస్తారు. దీంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది.