రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి - బంధువుల ఇంటి నుంచి వెళ్తుండగా విషాదం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 3:12 PM IST

thumbnail

Road Accident In Prakasam District : ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లి సమీపంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందింది. మృతులు కురిచేడు మండలం వీవై కాలనీకి చెందిన వారుగా గుర్తించారు. కూలిపని చేస్తూ జీవనం సాగించే వీరు మార్కాపురంలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగు ప్రయాణంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Three People Died In Bike Accident : ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొన్న ఈ ఘటనలో మృతులు కురిచేడు మండలం వీవై కాలనీకి చెందిన బత్తుల రామాంజనేయులు, అశోక్​గా పోలీసులు గుర్తించారు. మార్కాపురం మండలం తిప్పాయిపాలెం బంధువుల ఇంటి నుంచి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.  రామాంజనేయులు భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను ఒంగోలు తరలించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.