పంటల బీమాపై రైతుకు ఉందా ధీమా ?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 9:40 PM IST

thumbnail

Prathidhwani: రైతుల కోసం వైఎస్సార్‍ ఉచిత పంటల బీమా పథకం అమల్లోకి తెచ్చారు సీఎం జగన్. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు తరఫున పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నట్టు ప్రకటించారు. ఏ గ్రామంలో, ఏ రైతు ఏ పంటను, ఎన్ని ఎకరాల్లో వేశారన్నది ఈ–క్రాప్‌ ద్వారా గుర్తించి ఇన్సూరెన్స్‌ పరిధిలోకి తెచ్చామని జగన్ చెప్పారు. కానీ రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతోంది? ఆరోగ్యబీమా, వాహన బీమా, అగ్ని బీమా లాగే పంటల బీమా పరిహారం కూడా అంతే త్వరగా అందుతోందా? రైతులు ఈ పథకం గురించి ఏం అనుకుంటున్నారు? రాష్ట్రంలో కోటి 14 లక్షల ఎకరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది. పంట నష్టం జరిగితే బీమా వస్తుందన్న నమ్మకం రైతుల్లో కలిగించగలిగాం అని సీఎం పదేపదే చెబుతున్నారు. జగన్ మాట ఇచ్చారు అనే ధీమా రైతుల్లో కనిపిస్తోందా? ఈ–క్రాప్‌, ఈ-కేవైసీ, సామాజిక తనిఖీ ఆధారంగా నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తింప చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. దాని అమలు ఎలా ఉంది? ఇదీ నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.