మైనింగ్‌ అక్రమాలను నిరసిస్తూ సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష- అర్థరాత్రి భగ్నం చేసిన పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 10:54 AM IST

thumbnail

Police Disrupted Somireddy Chandramohan Reddy Satyagraha Initiation : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్షను సోమవారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే,  మైనింగ్‌ అక్రమాలను నిరసిస్తూ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి వద్ద 3 రోజులుగా సోమిరెడ్డి   సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. మూడు నెలలుగా అక్రమ మైనింగ్‌ జరుగుతోందని తెలిసినా సీఎస్ జవహర్‌రెడ్డి (CS Jawahar Reddy) గుడ్డిగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 

TDP Leader Somireddy Satyagraha Initiation Against Illegal Minings : సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి చేస్తున్న సత్యాగ్రహ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు రాత్రి 2 గంటల సమయంలో దీక్షా శిబిరం వద్దకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పోలీస్‌ వాహనాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. సోమిరెడ్డిని పోలీసులు బలవంతంగా జీబులో ఎక్కించుకున్నారు. అనంతరం నెల్లూరు అల్లీపురం ఆయన ఇంటి వద్ద దించి వెళ్లిపోయారు. పొదలకూరు పోలీసులు దీక్షను భగ్నం చేసే సమయంలో పోలీస్ చర్యలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల పెద్ద నినాదాలు చేశారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.