Police Attack on Husband Wife Suicide Attempt: భర్తపై పోలీసుల దాడి.. మనస్థాపంతో భార్య ఆత్మహత్యాయత్నం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2023, 10:32 PM IST

thumbnail

 Police Attack on Husband Wife Suicide Attempt: న్యాయం చేయాల్సిన పోలీసులే తమపై దాడి చేశారనే మనస్తాపంతో.. ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. చెరువులోపాలెం గ్రామనికి చెందిన రూతమ్మ అనే మహిళపై వైసీపీకి చెందిన నవీన్ , వీరేంద్ర, వినోద్ అనే యువకులు దాడి చేశారు. ఈ విషయంపై రూతమ్మ కుమారుడు రమేశ్​.. చేబ్రోలు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవటంతో దిశ పోలీసులను ఆశ్రయించారు. దీంతో వైసీపీ నాయకులు ఈనెల 7న.. తనపై, భర్త రమేశ్​పై దాడికి పాల్పడ్డారని భార్య దుర్గ తెలిపారు. దీనిపై రమేశ్​ మరోసారి చేబ్రోలు పోలీస్​ స్టేషన్​కు వెళ్లాడు. 

ఈ క్రమంలో తన భర్తను ఎస్సై ఆనంద్ కొట్టారంటూ దుర్గ మనస్తాపంతో నిద్రమాత్రలు మింగినట్లు వివరించింది. బాధితురాలు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్​లో చికిత్స పొందుతోంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ బాధితురాలిని పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.