రాష్ట్రంలో కలవర పెడుతున్న కరోనా- కొత్త కేసులతో ఆందోళన పడుతున్న ప్రజలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 10:55 PM IST

thumbnail

New Corona Cases in AP : రాష్ట్రంలో జేఎన్‌.1 పేరుతో కొత్తగా నాలుగు కరోనా కేసులు నమోదైనట్లు వైద్యశాఖ డైరెక్టర్ డాక్టర్‌ పద్మ తెలిపారు. ఇందులో విశాఖ, ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాల్లో కేసులు ఉన్నాయని వివరించారు. బాధితుల్లో ముగ్గురు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండగా మరొకరు విశాఖ KGH లో చికిత్స పొందుతున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి కోవిడ్‌ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. 

Corona Cases in NTR District : అయితే దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరగుతున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కేసులు పెరగడంతో అందరిలో కలవరం మెుదలైంది. తాజాగా వెలుగు చూసిన కేసులు ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా  నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. కరోనా సోకిన వారిలో మెడ, తలనొప్పి ,ఒళ్లు, కీళ్ల నొప్పులు, న్యుమోనియో లక్షణాలతో ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు వివరించారు . ప్రతిఒక్కరూ తప్పక మాస్క్ ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా  కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. అనుమానం ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.