ఎన్టీఆర్​ జిల్లాలో ప్రమాదకరంగా కాజ్​వే - ఎప్పుడు, ఏం జరుగుతుందోనని ప్రయాణికుల ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 3:44 PM IST

thumbnail

Nallavagu low level Kalvert Damaged at Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారులో చందర్లపాడు మార్గంలోని నల్లవాగుపై కాజ్​వే కుంగిపోయింది. దీంతో అటువైపుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాజ్​వే కుంగిపోవడంతో ఎటువంటి ప్రమాదం చోటుచేసుకుంటోదనని వాహనాదారులు ఆందోళన చెందుతున్నారు. నందిగామ నుంచి చందర్లపాడు వెళ్లే ఈ మార్గంలో ఇదే ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. కుంగిపోయిన కాజ్​వే ప్రమాదకరంగా మారడంతో ఏ సమయంలోనైనా బ్రిడ్జి కూలిపోయే అవకాశం ఉంది.

మొదట కొద్ది మొత్తంలో కుంగిపోయిన కాజ్​వే ప్రస్తుతం సగం రోడ్డు వరకు కుంగిపోయింది. ఇంతటి ప్రధానమైన రాహదారిపై ఉన్న లో లెవెల్​ కాజ్​వే కుంగిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఆర్​ అండ్​ బీ అధికారులు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపినా, ఏళ్లు గడుస్తున్న నిధులు మంజూరు చేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి లో లెవెల్​ కాజ్​వే స్థానంలో హై లెవల్​ వంతెన నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.