ప్రజలందరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాలి: మాజీమంత్రి కామినేని శ్రీనివాస్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 16, 2024, 3:26 PM IST

Updated : Jan 16, 2024, 3:51 PM IST

thumbnail

Nadendla Manohar met with former Minister Kamineni Srinivas: గుంటూరు జిల్లాలో జనసేన పీఎసీ ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్​ మాజీమంత్రి కామినేని శ్రీనివాస్​తో భేటీ అయ్యారు. తెలుగుదేశం నేత యడ్లపాటి వెంకట్రావు నివాసంలో మనోహర్​, కామినేని భేటీ కాగా, ఈ సమావేశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భేటీపై కామినేని శ్రీనివాస్​ స్పందించి స్పష్టతనిచ్చారు. భేటీ అనంతరం మనోహర్, కామినేని​తో అల్పాహారం తీసుకున్నారు. ఈ అల్పాహార విందులో తెలుగుదేశం, జనసేన నేతలు పాల్గొన్నారు.  

ఇది రాజకీయ సమావేశం కాదని కేవలం ఆత్మీయ సమావేశమేనని మాజీమంత్రి కామినేని శ్రీనివాస్​ స్పష్టం చేశారు. ప్రజలందరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తమ పిల్లల కోసం ఆలోచించాలని కోరారు. ఈ మేరకు మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించారు. తెలిసో, తెలియకో రాష్ట్రంలో పిచ్చి మొక్కను నాటామని అన్నారు.

పోటీ స్థానాలపై కామినేని వ్యాఖ్యలు: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో పోటీ స్థానాలపై కామినేని స్పందించారు. ఆ విషయం ముఖ్య నాయకులు చూసుకుంటారని, ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నది వారే నిర్ణయిస్తానన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్యనేతలు చూసుకుంటారని వివరించారు.  రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు, నిత్యావసర ధరల పెరుగుదల, రోడ్లు, విద్యుత్​, పెట్రోలు, మౌలిక సదుపాయాల కల్పన దారుణంగా మారిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎవరికి వారు గుండెల మీద చేయి వేసుకుని, తమ వంతు పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు.  

Last Updated : Jan 16, 2024, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.