తిరుపతిలో రైలు దిగుతుండగా జారి పడ్డ ప్రయాణికుడు.. రక్షించిన పోలీసులు

By

Published : Jun 9, 2023, 11:59 AM IST

thumbnail

Railway Police Saved Man: తిరుపతి రైల్వే స్టేషన్​లో ఓ వ్యక్తి రైలు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ట్రైన్​ నుంచి దిగటానికి ప్రయత్నించిన ఆ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన రైల్వే రక్షక్ష దళం సిబ్బంది తక్షణమే స్పందించి.. ప్రయాణికుడిని కాపాడారు. రైల్వే రక్షక దళం తిరుపతి ఇన్​స్పెక్టర్​ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 7 గంటల 22 నిమిషాల సమయానికి.. తిరువనంతపురం నుంచి నిజాముద్దీన్​ వెళ్లాల్సి​న స్వర్ణ జయంతి ఎక్స్​ప్రెస్,​ తిరుపతి రైల్వే స్టేషన్​లోని ఒకటో నెంబర్​ ఫ్లాట్​ ఫారంపై వచ్చి ఆగింది. 7 గంటల 28 నిమిషాలకు రైల్వే స్టేషన్​ నుంచి ట్రైన్​ బయల్దేరింది. అదే సమయంలో పశ్చిమ బంగాకు చెందిన స్వపన్​ కుమార్​ రాయ్​ అనే ప్రయాణికుడు కదులుతున్న స్వర్ణ జయంతి రైలు నుంచి దిగటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు కాలుజారి.. రైలుకు, ఫాట్​ ఫారానికి మధ్యలో పడబోయాడు. వెంటనే అక్కడున్న రైల్వే రక్షక దళానికి చెందిన కానిస్టేబుల్ లోకనాథం, మహిళా కానిస్టేబుల్ సంపూర్ణ స్పందించారు. ప్రయాణికుడ్ని రైలు నుంచి పక్కకు లాగి కాపాడారు. ఈ ప్రమాదంలో ప్రయాణికుడికి ఎటువంటి గాయాలు కాలేదని ఇన్​స్పెక్టర్​ మధుసూదన్ తెలిపారు. ప్రయాణికుడ్ని కాపాడిన సిబ్బందిని ఆయన అభినందించారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.