Mahasena Rajesh Cake Cutting on CM Jagan Bail: సీఎం జగన్ బెయిల్కు పదేళ్లు.. మహాసేన రాజేశ్ వినూత్న కార్యక్రమం..
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 24, 2023, 10:54 AM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-09-2023/640-480-19592773-thumbnail-16x9-mahesena-rajesh.jpg)
Mahasena Rajesh Cake Cutting on CM Jagan Bail: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. జగన్ బెయిల్పై విడుదలై పది సంవత్సరాలు గడిచిన సందర్భంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచిలో టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్పై 38 కేసులు ఉన్నాయని.. ఆ కేసుల వివరాలతో 38 కేకులను అమర్చి వాటిని పార్టీ శ్రేణుల సమక్షంలో కోశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 2 లక్షల 14 వేల మందికి శిక్షణ ఇచ్చి.. 74 వేల మందికి ఉపాధి కల్పిస్తే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. చంద్రబాబుది అభివృద్ధి అని.. జగన్మోహన్ రెడ్డిది అరాచకమని మహాసేన రాజేశ్ అన్నారు.
చంద్రబాబుకు నిర్మించడం, అభివృద్ధి చేయడం తెలిస్తే జగన్మోహన్ రెడ్డికి కూల్చివేయడమే తెలుసన్నారు. జగన్మోహనరెడ్డిపై 38 కేసులు ఉన్నాయని.. చంద్రబాబుపై ఒకే ఒక్క తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో గృహ నిర్మాణాలు, టిడ్కో ఇళ్లు నిర్మిస్తే.. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత.. రంగులు మార్చడం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. చంద్రబాబు త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తారని అన్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల అకలి తీర్చిన మహానుభావుడు చంద్రబాబును.. ప్రజలు దీవిస్తారని వాటిని కూల్చేసిన ఘనత సీఎం జగన్దని మండిపడ్డారు.