Janasena Murthy Yadav Fires on AU VC Prasad Reddy: 'చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఏయూ వీసీ.. విశ్వవిద్యాలయమా.. వైసీపీ కార్యాలయమా..?'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2023, 1:39 PM IST

thumbnail

Janasena Murthy Yadav Fires on AU VC Prasad Reddy: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని విశాఖ జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రసాద్‌రెడ్డి యూనివర్సిటీలో చట్ట వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారంటూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర హెచ్ఆర్​డీ​ మంత్రికి ఆయన మెయిల్ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ పాలక మండలి అనుమతి లేకుండా... యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్ (యూజీసీ)​ నిబంధనలు అనుసరించకుండా జేమ్స్ స్టీఫెన్​ను ఏయూ రిజిస్టర్​గా జేమ్స్ స్టీఫెన్‌ను నియామకం చేశారని మూర్తి యాదవ్‌ ఆరోపించారు.  

అర్హత లేని జేమ్స్ స్టీఫెన్‌కు ఎలా అంబేడ్కర్ ఛైర్​ను కట్టబెట్టారని మూర్తి యాదవ్​ ప్రశ్నించారు. ఓట్ల రాజకీయం కోసమే వైసీపీ ప్రభుత్వం ఈ రిజిస్ట్రార్ నియమాకాన్ని చేపట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రసాద్‌రెడ్డి యూనివర్సిటీ మొత్తాన్ని వైయస్సార్​ కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంగా మార్చారని మూర్తి యాదవ్​ ఆరోపించారు. వైస్ ఛాన్సలర్ ప్రసాద్​ రెడ్డి విధానాల వల్ల నష్టపోయిన వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని మూర్తి యాదవ్​ భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.