Janasena Leader Pothina Mahesh on Kanakadurga Temple EO Post: దుర్గ గుడి ఆలయ ఈవోగా ఐఏఎస్‌ని నియమించాలి: పోతిన మహేష్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 4:20 PM IST

thumbnail

Janasena Leader Pothina Mahesh Comments on Kanakadurga Temple EO Post : విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ఈవోగా ఐఏఎస్ అధికారిని నియమించాలని జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన మహేష్ డిమాండ్ చేశారు. మాజీ, ప్రస్తుత తాజా దేవాదాయ శాఖ మంత్రుల ఆధిపత్య పోరుతో ఆలయ అభివృద్ధి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు కాంట్రాక్టులు, కమిషన్ల కోసం అమ్మ వారి భక్తులు ఇబ్బంది పడాలా అని ప్రశ్నించారు.

Pothina Mahesh Comments on Dussehra celebrations In Kanakadurga Temple : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు పట్టుమని ఐదు రోజులు సమయం లేదని, ఇప్పటి వరకు ఏర్పాట్లు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శాఖల మధ్య సమన్వయం లోపం కొట్టొచ్చినట్టు తెలుస్తుందని అన్నారు. అమ్మ వారి ఆలయ ఈవోగా అర్హత లేని, సాధారణ దేవాదాయ శాఖలో గుమస్తా స్థాయి, బస్సు కండక్టర్​లను నియామకం చేస్తారా అని ప్రశ్నించారు. దసరా ఉత్సవాలలో ఏ చిన్న లోటు జరిగినా, అపశృతులు జరిగినా సీఎం జగన్ మోహన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని పోతిన మహేష్ హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.