మహా కేటుగాడు - బైక్ కనిపిస్తే చాలు చిటికెలో మాయమే

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 10:50 PM IST

thumbnail

Interstate Bike Thief Arrested: ద్విచక్రవాహనాల దొంగతనం చేసే అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఓ వ్యక్తిని చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 15 లక్షలు విలువైన 11 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పలమనేరులో గత కొంతకాలంగా బైక్​ల దొంగతనాలు జరుగుతున్నాయని.. వీటిపై తమకు ఫిర్యాదులు కూడా వచ్చాయని తెలిపారు. ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి విచారణ చేశామని అన్నారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. 

పట్టుకున్న వ్యక్తిని విచారించగా.. అతనితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు.. ఇద్దరూ కలిసి దొంగతనాలు చేస్తున్నట్లు నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు. నిందితుడు తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తంకు చెందిన లింగేశ్వరన్​గా అధికారులు గుర్తించారు. మరో వ్యక్తి పరారిలో ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డుల కోసం సిఫార్సు చేస్తామని చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.