అత్యంత ధనిక దేవస్థానం వద్ద పరిహారం చెల్లించడానికి సొమ్ములేదా? : టీటీడీ అధికారులపై హైకోర్టు అసహనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2023, 1:39 PM IST

thumbnail

High Court Impatient with TTD Officials for Delay of Compensation : తిరుమలలోని చిరుత దాడిలో మృతి చెందిన బాలిక కుటుంబానికి పెంచిన పరిహారం చెల్లింపులో జాప్యం చేసినందుకు టీటీడీ అధికారులపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అత్యంత ధనిక దేవస్థానం టీటీడీ వద్ద పరిహారం చెల్లించేందుకు సొమ్ము లేదా ? అని సూటిగా ప్రశ్నించింది. వారంలో బాధిత కుటుంబానికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

అలిపిరి నుంచి తిరుమల కాలిబాటలో వన్య ప్రాణుల దాడుల నుంచి భక్తులను రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించింది. వైల్డ్​లైఫ్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా కమిటీ ఇచ్చిన నివేదికపై సృష్టత ఇవ్వాలని టీటీడీ అధికారులను ఆదేశించింది. అవసరమైన చోట కాలిమార్గంలో ఇనుప కంచె వేయవచ్చని, అండర్​పాస్, అప్పర్​పాస్​లు ఏర్పాటు చేయవచ్చని నివేదిక చెబుతోందంటూ.. పిటిషనర్ తరుపున వాదనలు విన్న హైకోర్టు.. భవిష్యత్తులో ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారో తెలపాలని టీటీడీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.