వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణం - అమ్మవారికి అడుగడుగునా భక్తుల నీరాజనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 3:07 PM IST

thumbnail

Grandly Celebrated Indrakeeladri Giri Pradakshina: కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం(Vijayawada Durga Malleswara Swamy Temple) లో గిరిప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం, భక్త జనశ్రేయస్సు కోసం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్విహించారు. కొబ్బరికాయలు కొట్టి గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను అలంకరించి వాహనంపై దుర్గగుడి టోల్‌గేటు నుంచి బ్రహ్మణ వీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరిప్రదక్షిణ ఊరేగింపు నిర్వహించారు. 

Giri Pradakshina at Vijayawada: అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, కోలాట నృత్యాలు నడుమ వైభవంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.