వర్షపు నీటిలో ప్రభుత్వ రికార్డులు - పట్టించుకునే నాథుడే లేడయే

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 7:05 PM IST

thumbnail

Government Records on Rainwater in Prakasam District : దశాబ్దాల నాటి రెవెన్యూ రికార్డులు.. ఓటరు జాబితా వంటి విలువైన పత్రాలు వర్షపు నీటిలో నానిపోయి చెత్త కుప్పను తలపిస్తున్న ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.  జిల్లాలోని కనిగిరి పట్టణంలో.. బ్రిటీష్‌కాలం నాటి తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో.. నూతన భవనం నిర్మించారు.  కార్యాలయాన్ని నూతన భవనంలోకి మార్చినా.. విలువైన రికార్డులన్నీ పాత భవనంలోనే ఉంచేశారు. వర్షానికి పాత భవనం మొత్తం నీటితో నిండిపోగా.. ఆ వర్షపు నీటిలోనే విలువైన పత్రాలు నానిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రెవెన్యూ సిబ్బంది మొత్తం అక్కడే పని చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

ఉద్యోగులు తమకు ఏమీ పట్టనట్లుగా.. తమకు జీతం వస్తే చాలు అనుకుంటూ మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. భవిష్యత్తు తరాలకు ఈ దస్త్రాల అవసరం ఎంతో ఉన్నప్పటికీ.. ఏ అధికారి పట్టించుకోకపోవడంతో పలు విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వర్షపు నీటిలో నానుతూ పాడైపోతున్న రెవెన్యూ రికార్డులను భద్రపరచాలని స్థానికులు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.