Farmers hunger strike for CBN in Mandadam : చంద్రబాబుకు మద్దతుగా కొనసాగిన అమరావతి రైతులు నిరాహారదీక్షలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2023, 5:45 PM IST

thumbnail

Farmers hunger strike for CBN in Mandadam : గుంటూరు జిల్లాలో చంద్రబాబు మద్దతుగా అమరావతిలో మహిళలు ఆందోళనలు చేపట్టారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తుళ్లూరు మండలంలోని మందడంలో మహిళలు, రైతులు నిరాహారదీక్షలను కొనసాగించారు. ఈ దీక్షలను టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, గుంటూరు జిల్లా జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్​ యాదవ్​, గాదె వెంకటేశ్వరరావు ప్రారంభించి.. సంఘీభావం తెలిపారు.  

ఈ సందర్భంగా జనసేన నేతలు మాట్లాడుతూ.. ఒక అవినీతి ముఖ్యమంత్రి అయిన జగన్.. నీతిమంతుడైన టీడీపీ అధినేత చంద్రబాబుని అన్యాయంగా జైల్లో పెట్టారని ఆరోపించారు. సీఎం జగన్ పై ఉన్న అవినీతి మరకలను ఇతరులకు అంటించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికించారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి.. రాక్షస పాలనను అంతమొందిస్తామని జనసేన నేతలు ప్రకటించారు. ఎలాంటి అవినీతి జరగలేదని సీమెన్స్, ఇతర సంస్థలు ప్రకటించినా.. ఈ గుడ్డి ప్రభుత్వం పట్టించుకోవటంలేదని టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.