₹ 80లక్షల విలువైన సెల్​ఫోన్లు స్వాధీనం - రికవరీ చేసిన విశాఖ పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 3:29 PM IST

thumbnail

DCP Was Handover In Visakhapatnam To Victims Of Lost Cellphones: చాట్ బాట్ వెబ్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల మేరకు సుమారు ₹ 80 లక్షలు విలువ గల 450 సెల్​ఫోన్లను రికవరీ చేసినట్లు విశాఖ శాంతి భద్రతల డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. కమిషనరేట్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెల్ ఫోన్లు పోగొట్టుకొని ఫిర్యాదు చేసిన బాధితులకు రికవరీ చేసిన ఫోన్లను అందజేశామన్నారు. ఫోన్లు పోగొట్టుకున్నవారు చాట్ బాట్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే రికవరీ చేస్తామని డీసీపీ వెల్లడించారు.

దుండగుల నుంచి స్వాధీనం చేసుకున్న 450 ఫోన్లలో వివిధ రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పోగొట్టుకున్న వారివి కూడా ఉన్నాయని తెలిపారు. రికవరీ కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్​ పరిధిలోనే ఎక్కవ శాతం రికవరీ అయ్యినట్లు డీసీపీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ టెక్నికల్ సిబ్బందిని ఆయన అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.