తిరుమల శ్రీవారిని సందర్శించిన క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ - ఎగబడిన అభిమానులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2023, 1:31 PM IST

thumbnail

Cricketers Rishabh Pant and Akshar Patel Visit Tirumala: వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత క్రికెట్ జట్టు.. వరల్డ్ కప్ కైవాసం చేసుకోవాలని ప్రముఖ క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ తిరుమల శ్రీవారిని ప్రార్థించారు.. స్వామివారి అభిషేకం అనంతరం నైవేద్య విరామ సమయంలో సంప్రదాయ వస్త్రాలతో ఆలయంలోకి వెళ్లి గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన పంత్, పటేల్ తో పలువురు క్రికెట్ అభిమానులు సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు.

తిరుమలలో నిన్న టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు సమయం పట్టగా.. సర్వదర్శనానికి 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 59 వేల 335 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 23 వేల 271 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నరు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.29 కోట్లకు చేరింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.