Cricket Betting Gang Arrested in Visakhapatnam: క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. 350 కోట్ల రూపాయల లావాదేవీలు గుర్తింపు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 29, 2023, 6:17 PM IST

thumbnail

Cricket Betting Gang Arrested in Visakhapatnam: విశాఖ కేంద్రంగా భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయింది. ఈ కేసులో సుమారు 350 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని శాంతిభద్రతల డీసీపీ-1 శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రతి సోమవారం కమిషనర్ నిర్వహించే స్పందనలో (Spandana Program) ఓ బాధితుడు ఫిర్యాదుతో కదిలిన పోలీస్ యంత్రాంగం భారీ రాకెట్​కు సంబంధించిన 11 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో అనకాపల్లి జిల్లాకి చెందిన సూరి బాబు అనే ప్రధాన బుకీకి నగదు వెళ్తుందని గుర్తించారు. ఈయనతో పాటు దినేష్ అలియాస్ మొను, వాసు దేవరరావులు ప్రధాన బుకీలుగా గుర్తించామన్నారు. 11 ఆన్​లైన్ బెట్టింగ్ సైట్​లను, యాప్​లను, 63 బ్యాంక్ అకౌంట్​లను గుర్తించామని తెలిపారు. ఫిర్యాదు చేసిన బాధితుడు 8 లక్షల రూపాయల నగదు పోగొట్టుకున్నాడన్నారు. ఇప్పటికే వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న 75 లక్షల నగదును ఫ్రీజ్ చేశామన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.