అంగన్వాడీలను వీధిపాల్జేశారు - మహిళల ఉసురు తగులుతుంది- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 15, 2024, 1:27 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-01-2024/640-480-20511971-thumbnail-16x9-cpi-state-secretary-ramakrishna-fires-on-ysrcp-government.jpg)
CPI State Secretary Ramakrishna Fires on YSRCP Government: వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలకు సంక్రాంతి పండుగను దూరం చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ దుయ్యబట్టారు. అంగన్వాడీల న్యాయబద్దమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, వీరికి ఇచ్చిన హామీలను అమలు చేస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Ramakrishna About Anganwadis: రాష్ట్రవ్యాప్తంగా లక్షా 6 వేల మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు ముఖ్యమంత్రి జగన్ దూరం చేశారని రామకృష్ణ మండిపడ్డారు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిన మాట అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేసుంటే నేడు అంగన్వాడీలు రోడ్డెక్కేవారా, మాట తప్పను, మడమ తిప్పను అంటే ఇదేనా అని రామకృష్ణ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకుంటూ, అంగన్వాడీలను వీధులపాలు చేశారని ఆరోపించారు. జగన్ సర్కారుకు అంగన్వాడీ కుటుంబాల ఉసురు తగిలి తీరుతుందని రామకృష్ణ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్ సర్కారుకు తగిన గుణపాఠం చెబుతారని రామకృష్ణ హెచ్చరించారు.